టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారిగా తండ్రయ్యాడు. బుమ్రా సతీమణి, యాంకర్ సంజనా గణేశన్ సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బుమ్రా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. తన కుమారుడి ఫొటోని అభిమానులతో పంచుకుంటూ అంగద్ జస్ప్రీత్ బుమ్రా అని పేరు పెట్టినట్లు ఎక్స్లో తెలిపాడు.”మా చిన్న కుటుంబం పెరిగింది.. మా హృదయాలు మేము ఊహించిన దానికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాయి. ఈ ఉదయం మేము మా లిటిల్ బాయ్ అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోకి స్వాగతించాము. మేము ప్రస్తుతం చంద్రునిపై ఉన్నాము. మా జీవితంలోని ఈ కొత్త అధ్యాయం, దానితో పాటు తెచ్చే ప్రతిదాని కోసం వేచి చూస్తున్నాం.. జస్ప్రీత్ బుమ్రా- సంజన అంటూ బుమ్రా ట్విట్టర్లో రాసుకోచ్చాడు. దీంతో పలువురు నెటిజన్లు బుమ్రా-సంజన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అయింది. ఇదిలా ఉండగా.. ఆసియా కప్లో భాగంగా జరుగనున్న కీలకమైన నేపాల్ మ్యాచ్కు జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు. తన భార్య ప్రసవం సమయంలో ఆమె వద్ద ఉండేందుకు బుమ్రా స్వదేశానికి తిరిగివచ్చారు.
ఇక టీమిండియా సూపర్ 4కు అర్హత సాధించాలంటే నేపాల్పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అంత కీలకమైన పోరుకు బుమ్రా లేకపోవడం నిజంగా పెద్ద లోటు అని చెప్పాలి. అతడి స్థానంలో ఏ పేసర్ను తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఐర్లాండ్ సిరీస్తో పునరాగమనం చేసిన బుమ్రా మళ్లీ ఫామ్ అందుకున్నాడు. రెండు టీ20ల్లో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. దాంతో, బీసీసీఐ అతడిని ఆసియా కప్ పోటీలకు ఎంపిక చేసింది.
తప్పక చదవండి
-Advertisement-