- కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తుంది.
- మూడు విడతల్లో రూ.2,000 చొప్పున అందిస్తుంది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2,000 చొప్పున జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే 20వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాగా, ప్రస్తుతం 21వ విడత డబ్భుల కోసం వారు ఎదురుచూస్తున్నారు. దీనిపై తాజాగా అప్డేట్ అందుతోంది. ఈ విడత నగదు అక్టోబర్ నెలలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.