- పరామర్శించిన ఎమ్మెల్యే.
వనపర్తి మండలం అంకుర్ గ్రామానికి చెందిన రైతు శ్రీ నివాసరెడ్డి సోమవారం ప్రమాదవశాత్తు వరి కోత యంత్రంలో పడి మృతి చెందారు. మంగళవారం ఉదయం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్ర భుత్వ హాస్పిటల్ మార్చురీ వద్ద కుటుంబ సభ్యుల ను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అ డిగి తెలుసుకున్నారు.

మృతుడు తన వ్యవసాయ పొలంలో సాగుచేసిన వరి పంటను కోస్తుండగా ట్రా క్టర్ పై కూర్చున్న శ్రీనివాస్ రెడ్డి కిందకు దిగే ప్రయ త్నంలో ప్రమాదవశత్తు జారి వరి కోత యంత్రంలో పడి మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వ పర మైన ఆర్థిక సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానాని, మృతుని కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వనప ర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, నారాయణరెడ్డి పరామర్శించిన వారిలో ఉన్నారు.
