- అభినందనలు తెలిపిన ఎంఈఓ విఠల్
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతం పోరాటం చేస్తున్న పీఆర్టీయు టిఎస్ నూతన క్యాలెండర్ రూపొందించి ఆవిష్కరించుకోవడం అభినందనీయమని చిలిపిచేడ్ ఎంఈఓ విఠల్ కొనియాడారు. శనివారం చిలిపిచెడ్ మండలంలోని చండూరు ఉన్నత పాఠశాల ఆవరణలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సునిల్, బుచ్చి రాములు ఆధ్వర్యంలో మండల విద్యాధికారి విఠల్ చేతుల మీదుగా పిఆర్టియు టి ఎస్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రమేశ్,ధనమూర్తి,జిల్లా బాధ్యులు సర్వన్,ధన్సింగ్,సలీమ,మండల బాధ్యులు నర్సింలు,మురళి,సీనియర్ నాయకులు నాగేందర్ రెడ్డి,విష్ణు,శశిధర్ ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -
