Monday, October 27, 2025
ePaper
Homeమహబూబ్‌నగర్‌Demolitions | కూల్చివేతల పట్ల నిరసన

Demolitions | కూల్చివేతల పట్ల నిరసన

మద్దూరు టౌన్‌లో మెయిన్ రోడ్డును వెడల్పు చేసే పనుల్లో భాగంగా రహదారికి ఇరువైపులా ఉన్న నిర్మాణాలను సమాచారం లేకుండా కూల్చివేయటం (Demolitions) పట్ల బాధితులు నిరసన తెలిపారు. ఓల్డ్ బస్టాండ్‌లో దుకాణాలు కోల్పోయినవారు రోడ్డు మీద బైఠాయించి నష్టపరిహారం (Compensation) కోసం డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ధర్నా(Dharna)ను విరమింపజేశారు.

మెయిన్ రోడ్డును రెండు వరుసలుగా విస్తరింపజేయాలని అధికారులు పనులు మొదలుపెట్టారు. దీనికోసం రెండు గంటల జంక్షన్ నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు రెండు వైపులా 35 అడుగుల చొప్పున మొత్తం 70 అడుగుల మేర రోడ్డు రానుంది. ఈ మేరకు రేణుమట్ల సెంటర్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ (Government Hospital) కాంపౌండ్ వాల్ వైపు 35 ఫీట్లు దాటి మిగిలి ఉన్న షాపులను రాత్రికిరాత్రే జేసీబీలతో కూల్చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News