భైంసా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమం పలు కుటుంబాల్లో వెలుగులు నింపింది. మనస్పర్థలతో విడిపోయిన దంపతులకు పోలీసులు సమర్థవంతంగా కౌన్సిలింగ్ నిర్వహించడంతో, వారు తిరిగి కలిసి జీవించేందుకు మొగ్గు చూపారు. సమస్యలను పరిష్కరించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు ఆ జంటలు గురువారం కృతజ్ఞతలు తెలిపాయి. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ప్రజావాణిని వేదికగా చేసుకోవాలని వారు కోరారు.
- Advertisement -
