Monday, October 27, 2025
ePaper
Homeమహబూబ్‌నగర్‌Goud | ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పల్లె లక్ష్మణరావు గౌడ్

Goud | ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పల్లె లక్ష్మణరావు గౌడ్

తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు (President of Telangana State Gowda Association) పల్లె లక్ష్మణరావు గౌడ్ (Palle Laxmanrao Goud) మహబూబ్‌నగర్ (Mahaboobnagar) జిల్లా ఏనుగొండలోని శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వర స్వామి-సురమాంబ శిల విగ్రహ స్థిర ప్రతిష్ట, వనం మైసమ్మల గౌడ కుల దేవతల విగ్రహ ప్రతిష్ట, కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ మునిసిపల్ మాజీ చైర్మన్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఆహ్వానం మేరకు హాజరయ్యారు.

ఈ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు (MP) డీకే అరుణ (DK Aruna), తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు డి.ఆనంద్ గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం కార్యదర్శి టి.సుదర్శన్ గౌడ్, జిల్లా కమిటీ వైస్ ప్రెసిడెంట్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News