నిర్మల్ పట్టణం లోని పలు హోటళ్లలో, రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ దేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్టు జిల్లా పౌరసరఫరాల అధికారులు తెలిపారు. శుక్రవారం 16 హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా, గృహావసరాల కొరకు కేటాయించిన 29 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఎట్టి పరిస్థితుల్లో చట్టానికి విరుద్ధంగా గృహ అవసరాల కొరకు కేటాయించిన సిలిండర్లను వ్యాపార అవసరాల కొరకు ఉపయోగించరాదని అధికారులు తెలిపారు. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ అవసరాల కొరకు ఉపయోగిస్తే, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.
- Advertisement -
