- హర్షం వ్యక్తం చేస్తున్న బీసీ సంఘాలు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు అన్న, పిన్నింటి సునీల్ రావు వార్డు సభ్యునిగా ఓటమి. పూర్తి వివరాల్లోకి వెళితే పర్వతగిరి మండల కేంద్రంలో గురువారం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 5వ వార్డు సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు, ఏఎంసీ మాజీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు సొంత అన్న పిన్నింటి సునీల్ రావు ఓటమిపాలయ్యారు. జనరల్ స్థానం నుండి టిఆర్ఎస్ తరఫున పోటీ చేసిన బీసీ బిడ్డ కొప్పు రాజు దాదాపు 80 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించాడు. ఈ సందర్భంగా బిసి సంఘాలు, బిసి నాయకులు రాజు విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -
