కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు అమలు చేయాలన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇచ్చిన హామీలు విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులు, దివ్యాంగులు సహా ఇతర పింఛన్లు పెంచాలని, కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇవ్వాలని, అంగన్ వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ప్రజా భవన్ ఎదుట జాగృతి ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో భారీగా జగృతి కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. అనంతరం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ కు కవిత వినతి పత్రం అందజేశారు.
- Advertisement -
