Friday, September 12, 2025
ePaper
spot_img
Homeఆంధ్రప్రదేశ్ఆ రెండు పంటలకు ఈ ఏడాది నుంచి ఇన్సూరెన్స్

ఆ రెండు పంటలకు ఈ ఏడాది నుంచి ఇన్సూరెన్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లోలోని కొబ్బరి, పొగా పంటలకు ఈ ఏడాది నుంచి బీమా వర్తించనుంది. 2024లో మామిడిని పంటల బీమాలోకి చేర్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనతో ఈ రెండు పంటలను కూడా ఇన్సూరెన్స్ పరిధిలోకి తెచ్చింది. వీటిని పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమాలో చేర్చారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖతో జత కట్టిన రాష్ట్ర వ్యవసాయ శాఖ కొబ్బరి, పొగాకు పంటలకు బీమా అమలు కోసం టెండర్లను ఆహ్వానించింది.

వీటిని ఇవాళ (జూన్ 6న శుక్రవారం) ఫైనల్ చేయనుంది. ప్రభుత్వ ఆమోదంతో అవార్డు నోటీసును జారీ చేస్తుంది. కొబ్బరికి బీమాను వర్తింపజేయడానికి 2025 ఖరీఫ్‌లో 7 జిల్లాల్లోని 3 క్లస్టర్లు, పొగాకుకి ఇన్సూరెన్స్ ఇవ్వటానికి 2025-26 రబీలో 6 జిల్లాల్లోని 3 క్లస్టర్లను అర్హత కలిగిన ప్రాంతాలుగా గుర్తించింది. బీమా ప్రయోజనాలు పొందేందుకు నోటిఫైడ్‌ ఏరియాల్లోని రైతులు, కౌలు సాగుదారుల వివరాలను నమోదుచేయాలి. ప్రీమియంలో తన వాటాను రైతు చెల్లిస్తే సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చెల్లిస్తాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News