పాకిస్థాన్(Pakistan) మాజీ ప్రధాని(Former Prime Minister) ఇమ్రాన్ఖాన్(Imran Khan) చనిపోయారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(Tehreek-e-Insaf) కార్యకర్తలు ఈరోజు మరోసారి ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించాయి. దీంతో సర్కారు మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. రేపటి (డిసెంబర్ 3) వరకు బహిరంగ సభలను(Public Meetings), ర్యాలీలను నిషేధించింది(Ban). రావల్పిండి (Rawalpindi)లో సెక్షన్ 144 (Section 144) విధించింది. ఇదిలాఉండగా ఇమ్రాన్ఖాన్ విషయంలో ఆయన కుమారులు (Sons) సైతం తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. తమ తండ్రికి జైలులో ఏదో జరిగిందనే సందేహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ఖాన్ను చూసేందుకు అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవటం పట్ల మండిపడ్డారు.
Imran Khan | ఇమ్రాన్ఖాన్ విషయంలో చల్లారని ఆందోళనలు
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
