నిర్మల్ జిల్లా (Nirmal District) కేంద్రంలో నిర్మించనున్న కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ (Collector Camp Office) బిల్డింగ్కి బీజేఎల్పీ నేత(Bjlp Leader), నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal Mla) ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Yeleti Maheshwar Reddy) భూమి పూజ చేశారు. ఈ భవనాన్ని రూ. 8.10 కోట్లతో 5.38 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అనంతరం దీనిపై అధికారులతో సమీక్ష (Review) నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మాజీ ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షుడు వి.సత్యనారాయణ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుకు సత్యం చంద్రకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్, పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, ఆఫీస్ సెక్రటరీ రాచకొండ సాగర్, ట్రెజరర్ అల్లం భాస్కర్, BJYM జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, తాజా మాజీ కౌన్సిలర్లు సాదం అరవింద్, బిట్లింగ్ నవీన్, నరేందర్, శంకర్ పతి, శ్రీరామోజు నరేష్, జప ప్రసాద్, జుట్టు దినేష్, సాత్విక్, రంజిత్, గంజి రాజు, సుంకరి రాజేష్, బంటి, ఈర్ల విజయ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
