సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి (ఏకతా దివస్) పురస్కరించుకొని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కుందనపల్లి రోటరీ నుండి రాంపల్లి దాయర వరకు సర్వీస్ రోడ్లో శుక్రవారం 2కె రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కీసర ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్కపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది, గౌతమి డిఫెన్స్ అకాడమీ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను ప్రజలలో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.
- Advertisement -
