- మూడుసార్లు ఏపీకి రప్పించిన ఘనత నాదే..
- సంజీవిని పథకం కోసం వస్తున్నారని వెల్లడించిన చంద్రబాబు నాయుడు
మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 16న సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శనివారం అమరావతిలో పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన భేటీలో సీఎం చంద్రబాబు ఈ విషయం వెల్లడించారు. ‘ఎల్లుండి అమరావతికి బిల్ గేట్స్ వస్తున్నారు.
బిల్ గేట్స్ను 3 సార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత నాదే’ అని సగర్వంగా ప్రకటించారు. తొలిసారి హైటెక్ సిటీ (హైదరాబాద్) కోసం, రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం గేట్స్ను రప్పించానని, ఇప్పుడు సంజీవని పథకం కోసం పిలిపిస్తున్నామని వివరించారు. ఆరోగ్య రంగాన్ని విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో సంజీవని పథకం రూపొందుతోంది.
బిల్ / మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఈ పథకం ద్వారా గ్రామీణ ఆరోగ్య సేవలు, వ్యాక్సినేషన్, మాతా శిశు సంరక్షణ వంటి అంశాల్లో పురోగతి సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, సంజీవని పథకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 2025లో ప్రవేశపెట్టిన టెక్నాలజీ ఆధారిత ప్రజా ఆరోగ్య కార్యక్రమం.
ఇది రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధప్రదేశ్’గా మార్చడం, ప్రతి పౌరుడికీ డిజిటల్ హెల్త్ రికార్డులు, ముందస్తు రోగ నిర్ధారణ, ఉచిత, సులభ వైద్య సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ హెల్త్ రికార్డులు: సంజీవని పథకం కింద ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్/డిజిటల్ హెల్త్ కార్డ్ ఇస్తారు. ఇందులో వైద్య పరీక్షలు, చికిత్స చరిత్ర, ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ రిపోర్టులు, వ్యాక్సినేషన్ రికార్డులు స్టోర్ అవుతాయి.
మొబైల్ ఫోన్ ద్వారా డాక్టర్ అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవచ్చు. క్యాన్లెస్, పేపర్లెస్ మాత్రమే కాకుండా తక్షణ సాయం అందుతుంది. ప్రతి కుటుంబానికీ సంవత్సరానికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స (యూనివర్సల్ హెల్త్ కవరేజ్). అవసరమైతే ట్రస్ట్ ద్వారా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం రూ.25 లక్షల వరకు సాయం అందించనున్నారు. ముందుగానే రోగాలను గుర్తించడం.
ఉదాహరణకు 30 ఏళ్లు దాటిన వారికి, హై-రిస్క్ కేసులకు స్క్రీనింగ్. రాష్ట్రవ్యాప్తంగా 72.73 లక్షల మందికి 42 రకాల వైద్య పరీక్షలు (రక్త పరీక్షలు, డయాబెటిస్, గుండె సంబంధిత వంటివి) చేస్తారు. ఎఐఆధారిత స్క్రీనింగ్, పర్సనలైజ్డ్ మెడిసిన్ కార్యక్రమాన్ని బిల్ / మెలిండా గేట్స్ ఫౌండేషన్, టాటా కన్జలెన్సీ సర్వీసెస్ సహకారంతో అమలు చేస్తున్నారు.
ఇది ఆయుష్మాన్ భారత్, హెల్త్ సర్వీసెస్తో ఇంటిగ్రేట్ అవుతుంది. అమరావతి రాజధాని ప్రాంతంగా ఉండటంతో.. సంజీవని పథకం ఇక్కడ ప్రధానంగా అమలు చేయాలని చూస్తున్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో డిజిటల్ హెల్త్ రికార్డులు, పర్సనలైజ్డ్ మెడిసిన్ వంటి అంశాలు అమరావతిలో ఫోకస్ చేస్తున్నారు.
బిల్ గేట్స్ తన పర్యటనలో (ఫిబ్రవరి 16) అమరావతికి వచ్చి ఈ పథకంపై చర్చలు జరుపుతారు. ఇది అమరావతిని హెల్త్కేర్ / టెక్నాలజీ హబ్ గా మార్చే భాగంగా చూస్తున్నారు. మొదటి పైలట్ ప్రోగ్రాం కుప్పం నియోజకవర్గంలో విజయవంతంగా ప్రారంభమైంది. తర్వాత 2026 జనవరి నుంచి చిత్తూరు జిల్లా మొత్తం అమల్లోకి తెచ్చారు.
2026లో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా అమలు చేస్తారు. జూలై 2026 నాటికి లక్షల మంది స్క్రీనింగ్ పూర్తి చేసి, ఆరోగ్య భద్రతను బలోపేతం చేయాలనేది ఈ పథకం లక్ష్యం. ఈ పథకం రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చే ‘గేమ్ ఛేంజర్’గా చెబుతున్నారు.
