తమకు రోడ్డు సౌకర్యం (Road Fecility) కల్పించాలని ఆర్మూర్ పట్టణం ఎన్టీఆర్ కాలనీ(NTR Colony) వాసులు ఆర్మూర్ ఎమ్మెల్యే (Armoor Mla) పైడి రాకేష్ రెడ్డి(Paidi Rakesh Reddy)ని కోరారు. ఈ మేరకు ఆయన్ని అంకాపూర్లోని నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. గత 40 ఏళ్లుగా కాలనీకి ఆర్టీసీ బస్ డిపో (Rtc Bus Deport) నుంచి రాకపోకలు సాగిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ అధికారులు డిపో చుట్టూ కాంపౌండ్ వాల్ (Compound Wall) నిర్మించడంతో రాకపోకలకు ఇబ్బందవుతోందని ఎమ్మెల్యేకి చెప్పారు. ఈ విషయమై వెంటనే స్పందించిన ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడి కాలనీకి 12 ఫీట్ల రోడ్డు వదిలేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Rakesh Reddy | రోడ్డు చోటు ఇవ్వాలని ఆర్టీసీకి ఆదేశం
- Advertisement -
RELATED ARTICLES

