నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ కాలనీలో ఆలయం వద్ద పేరుకుపోయిన చెత్త సమస్యపై కాలనీ నాయకుడు లక్ష్మణ్ వెంటనే స్పందించారు. వాట్సాప్ గ్రూప్లో వచ్చిన ఫిర్యాదును గమనించిన ఆయన మున్సిపల్ అధికారులతో మాట్లాడి సిబ్బందిని రప్పించారు. స్వయంగా అక్కడే ఉండి చెత్తను పూర్తిగా తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు. సమస్యను తక్షణమే పరిష్కరించిన లక్ష్మణ్కు స్థానికులు అభినందనలు తెలిపారు.


- Advertisement -
