Tuesday, June 2, 2026
HomeతెలంగాణKavitha | ట్యాంక్ బండ్ పై ప్రొ. జయశంకర్ విగ్రహం పెట్టాలి..

Kavitha | ట్యాంక్ బండ్ పై ప్రొ. జయశంకర్ విగ్రహం పెట్టాలి..

  • డిమాండ్ చేసిన టి.ఆర్.ఎస్. చీఫ్ కల్వకుంట్ల కవిత..

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి రోజైన ఆగస్టు 6వ తేదీ లోపు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని తెలంగాణ రాష్ట్ర సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 12 ఏళ్లు పూర్తయినప్పటికీ, స్వరాష్ట్ర ఉద్యమానికి సిద్ధాంతపరమైన వెన్నెముకగా నిలిచిన జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ప్రభుత్వం ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడం తీవ్ర విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకవేళ ప్రభుత్వం ఆగస్టు 6 లోపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైతే, కనీసం తమ పార్టీకైనా అనుమతి ఇవ్వాలని, తామే స్వయంగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూనే, స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు, ఉద్యమకారులకు ఆమె ఘన నివాళులర్పించారు.

- Advertisement -

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సరైన గుర్తింపు, గౌరవం దక్కాలని ఆమె కోరారు. అలాగే జూలై 2వ తేదీ లోపు అమరవీరుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News