- 205 పరుగుల భారీ స్కోరు..
- 2 వికెట్ల 23 పరుగులతో పోరాడుతున్న ముంబై..
ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. వాంఖడే స్టేడియం వేదికగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్, ఏ ఒక్కరూ భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా వచ్చిన వారంతా తలోచేయి వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది.
రాజస్థాన్ ఇన్నింగ్స్లో ఏ ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు. అయినా పరుగుల వేగం మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (17 బంతుల్లో 27) మూడు సిక్సర్లతో మెరుపు ఆరంభాన్నిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (26 బంతుల్లో 38) టాప్ స్కోరర్గా నిలిచాడు. చివర్లో దసున్ షనక (15 బంతుల్లో 29), జోఫ్రా ఆర్చర్ (15 బంతుల్లో 32) విధ్వంసకర ఇన్నింగ్స్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ తమ ఇన్నింగ్స్లో మూడు సిక్సర్ల చొప్పున బాదారు. రవీంద్ర జడేజా (19 నాటౌట్), నండ్రే బర్గర్ (10 నాటౌట్) ఆఖరి ఓవర్లలో దూకుడుగా ఆడటంతో రాజస్థాన్ 200 పరుగుల మార్కును దాటింది.
ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసినప్పటికీ పరుగులను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ చెరో రెండు వికెట్లు పడగొట్టినా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్లో గెలవాలంటే ముంబై ఇండియన్స్ 206 పరుగులు చేయాల్సి ఉంది.
