నిర్మల్ జిల్లా మంజులాపూర్లో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాజన్న మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారని తెలిపారు. కరువు భత్యం 55 పాయింట్లు పెరిగిన నేపథ్యంలో, ప్రతి 1,000 బీడీలకు ₹5.50 చొప్పున పెరిగిన కూలీని కార్మికులకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు
- Advertisement -
