ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Laxma Reddy) సోమవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చర్లపల్లి డివిజన్ (Charlapalli Division) పరిధిలోని లక్ష్మీనగర్లో శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వార్ల, అభయ ఆంజనేయ స్వామి నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన (Statue Installation) మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వార్ల ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దీంతోపాటు.. రామంతపూర్లోని ప్రగతి నగర్లో వెంకట్ రెడ్డి నివాసంలో జరిగిన సత్యనారాయణ స్వామి పూజ(Satyanarayana Swamy Pooja)లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణభవన్(Telangana Bhavan)లో జరిగిన జూబ్లీహిల్స్ పోలింగ్ ఏజెంట్ల (JubileeHills Polling Agents) సమావేశంలో పాలుపంచుకున్నారు.

