మొంథా (Mantha) తుఫాన్ (Cyclone) ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సీఎం చంద్రబాబు (CM ChandraBabu) బయలుదేరారు. హెలికాప్టర్ (Helicopter) ద్వారా ఏరియల్ విజిట్ (Ariel Visit) చేయనున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాలను విహంగ వీక్షణం చేస్తారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ఏరియల్ విజిట్ జరగనుంది. ఈ మేరకు కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ల్యాండ్ అవనున్నారు. ఓడలరేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తారు.

- Advertisement -
