యూరియా కొరత(Urea Shortage)ను తీర్చడంలో సహకరించిన వ్యవసాయ కమిషనర్(Commissioner of Agriculture) డాక్టర్ బి.గోపీని బీజేపీ ఎమ్మెల్యే(Bjp Mla)లు సన్మానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (Combined Adilabad District) ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్(Mudhol MLA Rama Rao Patel), సిర్పూర్ శాసన సభ్యుడు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు (Sirpur MLA Dr. Palvai Harish Babu) ఈ రోజు హైదరాబాద్లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్లో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. రైతుల సమస్యను పరిష్కరించటానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపి శాలువాతో సత్కరించారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు అంశాలను గోపీ దృష్టికి తెచ్చారు.
- Advertisement -
