తెలంగాణ(Telangana)లోని చేవెళ్ల (Chevella) దగ్గర చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) పట్ల ఏపీ డిప్యూటీ సీఎం (Ap Deputy CM) పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు(Rtc Bus)ను కంకర లారీ (Lorry) ఢీ కొట్టడంతో 17 మంది మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
- Advertisement -
