అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్కు యాక్సిడెంట్ అయిందని పరిస్థితి విషమంగా ఉందంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై కాజల్ స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానని ఆ వార్తలన్నీ రూమర్స్ మాత్రమేనని చెప్పారు. కాజల్కు యాక్సిడెంట్ అయిందనే వార్తలు సోమవారం సాయంత్రం సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఆందోళన చెందిన అభిమానులు ఆమెను ట్యాగ్ చేస్తూ పోస్ట్లు పెట్టారు. దీనిపై కాజల్ స్పందిస్తూ ఈ వార్తలను ఖండించారు. నిజం చెప్పాలంటే అవి చూసి నేను నవ్వుకున్నాను. ఎందుకంటే ఇంతకుమించిన ఫన్నీ న్యూస్ ఉండదు. అవన్నీ పూర్తి అవాస్తవం. దేవుడి దయ వల్ల నేను క్షేమంగా, సురక్షితంగా ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మొద్దు, ప్రచారం కూడా చేయొద్దని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి ఫేక్ న్యూస్లను షేర్ చేసే బదులు ఏవైనా నిజమైన వార్తలను నలుగురితో పంచుకోండి అంటూ నోట్ విడుదల చేశారు.