Tuesday, October 28, 2025
ePaper
Homeఆరోగ్యంఫిజియోథెరపీ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలి

ఫిజియోథెరపీ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలి

మండల విద్యాధికారి బివి.రామాచారి

కూసుమంచి మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో ప్రతి సోమవారం, బుధవారం నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి బివి.రామాచారి అన్నారు. స్థానిక భవిత కేంద్రంలో నిర్వహించబడుతున్న ఫిజియోథెరపీ క్యాంప్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బివి.రామాచారి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఏర్పాటు చేయబడినదే భవిత కేంద్రం అని తెలిపారు. ఈ కేంద్రంలో సాధారణ విద్యార్థులతో సమానంగా విద్యను అందించడంతో పాటు, వారి మానసిక, శారీరక ఎదుగుదలకు సహాయం చేస్తారని చెప్పారు.విద్యార్థులకు విద్యతో పాటు వసతులు, అవసరమైన స్టడీ మెటీరియల్స్, ఫిజియోథెరపీ వంటి సదుపాయాలను కల్పిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఇఆర్పి కళ్యాణి, ఫిజియోథెరపిస్ట్ గోపి నాగలక్ష్మి, సిఆర్పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News