మంచిర్యాల జిల్లా (Manchryala District) శ్రీరాంపూర్ (Srirampur) సీఐ వేణుచందర్ (Venuchandar)ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జైపూర్ మండలం నర్సింగాపూర్లో వడ్ల కొనుగోలు కేంద్రం(Grain Purchasing Center)లో జరిగిన అక్రమాల (Irregularities) విషయంలో 13 మందిపై కేసు నమోదు కావడం తెలిసిందే. అయితే.. ఈ కేసు దర్యాప్తు(investigation)లో సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) నిర్లక్ష్యం(Carelessly)గా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐపై ఉన్నతాధికారులు వేటు వేశారు.
- Advertisement -
