ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నేతలు
జవహర్ నగర్, జనవరి 23(ఆదాబ్ హైదరాబాద్): ముత్తుస్వామి కాలనీ(Mutthuswami Colony)లో కొలువైన శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం(Second Anniversary) సందర్భంగా ప్రత్యేక పూజల(Special Puja)ను ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లా వినయ్ కుమార్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు(Congress Party Leaders) రమేష్ చారి, తిరుపతి, అజయ్ కుమార్, జంగిలి శ్రీనివాస్, సాయి నేత, కిషోర్ తదితరులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అమ్మవారిని దర్శించుకొని ప్రజలకు శాంతి, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. దేవాలయ కమిటీ సభ్యులు నాయకులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
