- విద్యాశాఖ అధికారి బైరి సరళ ఘన సన్మానం..
- పదవి విరమణ అభినందన సన్మాన మహోత్సవంలో
- జిల్లా మండల వివిధ సంఘాల బాధ్యులు ఘన సన్మానం..
పదవి విరమణ అభినందన సన్మాన మహోత్సవం తేదీ 21 జనవరి 2026 రోజున జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల జల్లిలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ టీచర్ పుల్లూరి జగన్మోహన్
పదవీ విరమణ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశమునకు పాఠశాల హెడ్మాస్టర్ మరియు మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి బి సరళ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ పుల్లూరి జగన్మోహన్ ని ఘనంగా సన్మానించి, ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన వారు యొక్క సేవలను గూర్చి వివరించడం జరిగింది. మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. 2011వ సంవత్సరం నుండి ఇప్పటివరకు 14 సంవత్సరాలుగా జల్లి పాఠశాలలో మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మరియు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పేద విద్యార్థులకు అండగా ఉంటూ వారి కృషికి నిత్యం అభివృద్ధికి పాటుపడుతూ ఈరోజు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా జిల్లా, మండల వివిధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్యార్థి చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇది కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు సరిత అశోక్ శైలజ బిక్షపతి అనిత పద్మావతి రాము లు పాల్గొన్నారు.
