ఇటీవల గ్రూప్ 1 ఫలితాల్లో ఉద్యోగాలు సాధించి జిల్లా బీసీ అభివృద్ధి అధికారిగా ఎంపికైన ఐదుగురు ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపి నియామక పత్రాలు అందజేశారు. నిర్మల్కు చెందిన సాయి కుమార్, మంచిర్యాల్కు చెందిన విష్ణు నందన్, సాయి శ్రీజ, హైదరాబాద్కు చెందిన విశాల్, సిద్దిపేటకు చెందిన లావణ్య నియామక పత్రాలు అందకున్నారు. వీరికి 9 నెలల ట్రైనింగ్ తరువాత పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి, ఎంబిసి సీఈవో అలోక్ కుమార్ పాల్గొన్నారు.


