నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే (Nizamabad Urban MLA) ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా(Dhanpal Suryanarayana Gupta), అదే జిల్లాలోని ఆర్మూర్ ఎమ్మెల్యే (Armoor MLA) పైడి రాకేష్ రెడ్డి (Paidi Rakesh Reddy)ఢిల్లీ వెళ్లారు. నిజామాబాద్ ఎంపీ (Nizamabad MP) ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind)తో కలిసి పార్లమెంట్ (Parliament) ప్రాంగణంలో కేంద్ర మంత్రుల(Central Ministers)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కీలకమైన అభివృద్ధి పనుల(Development Works)ను వారి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక సమస్యలను కూడా వివరించారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు విడుదల చేయాలని కోరారు. వీరి విజ్ఞప్తికి కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు.
- Advertisement -
