- నూతన కమిటీని ప్రకటించిన జిల్లా ప్రధాన కార్యదర్శి మరియాల గోపాల్
సికింద్రాబాద్ జోన్ అడ్డగుట్ట డివిజన్లో రజక వృత్తిదారుల సంఘం నూతన కమిటీ ఎన్నికలను జిల్లా ప్రధాన కార్యదర్శి మరియల గోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు అడ్డగుట్టలో నిర్వహించారు.ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షుడిగా జి.నర్సింగరావు,కార్యదర్శిగా కె.స్వామి ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షులుగా టి.నర్సింగరావు,కె.మల్లేష్,వి.కృష్ణ,సహాయ కార్యదర్శిగా ఎస్.విజయ్,ట్రెజరర్గా సీహెచ్.కరుణాకర్,సోషల్ మీడియా కన్వీనర్గా ఎం.నవీన్ను నియమించారు.సమావేశంలో మరియల గోపాల్ మాట్లాడుతూ రజక వృత్తిదారులు ఐక్యంగా పనిచేసి సంఘాలు,సొసైటీలు ఏర్పాటు చేసుకొని రాజకీయంగా,సామాజికంగా అభివృద్ధి చెందాలని,ప్రభుత్వ పథకాల్లో అర్హత సాధించాలని పిలుపునిచ్చారు.
- Advertisement -
