మోత్కూరు, జనవరి 23(ఆదాబ్ హైదరాబాద్): త్వరలో మునిసిపల్ ఎన్నికలు(Municipal Elections) జరగనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులకు శిక్షణ(Training To Officers) కార్యక్రమం నిర్వహించినట్లు మోత్కూర్ మునిసిపల్ కమిషనర్(Mothkur Municipal Commissioner) కె.సతీష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్(State Election Commission) ఆదేశాల మేరకు శుక్రవారం మోత్కూరు మునిసిపల్ ఆఫీసులో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ, ఇతర అధికారులకు జిల్లా మాస్టర్ ట్రైనర్ ద్వారా శిక్షణ నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ప్రభాకర్, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, జోనల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -
