జీహెచ్ఎంసీ నాగారం డివిజన్ భోగారం ప్రధాన రహదారిలోని భారీ గుంతలతో వాహనదారులు గాయాలపాలవుతున్నారు. సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో పన్నులు కడుతున్న ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందల వాహనాలు తిరిగే ప్రధాన రహదారి ఇలాంటి దుస్థితికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని వాహనదారులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని మరమ్మతు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
- Advertisement -
