రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు – కంకర టిప్పర్ ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదం ఎంతో విషాదకరమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఈ దుర్ఘటనలో పలువురు చిన్నారులు సైతం కోల్పోవడం హృదయాన్ని కలచి వేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో అధికారులు సేవలు చేస్తున్నారన్నారు. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థించారు.
- Advertisement -
