కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చెత్త లారీ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ని ర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైంది. బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన రవీందర్ (54) ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా కీసర ఔటర్ రింగ్ వద్ద లారీ వెనుక టైర్ల కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలం నుండి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారైయ్యాడు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
