వైఎస్సార్సీపీ నేత(Ysrcp Leader), మాజీ మంత్రి జోగి రమేష్ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం (Fake Alcohol) కేసుకు సంబంధించి ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా(Ntr District)లోని ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లారు. జోగి రమేష్తోపాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడలోని ఎక్సైజ్ ఆఫీసుకు తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. జోగి రమేష్ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం తయారుచేసినట్లు ఈ కేసులోని ఏ1 నిందితుడు అద్దేపల్లి జనార్ధనరావు ఇటీవల పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు.
- Advertisement -
