- పట్టణ కార్యదర్శి జే రమేష్..
సిపిఐ వనపర్తి పట్టణ మాజీ కార్యదర్శి కామ్రేడ్ బొలమోని నాగన్న స్ఫూర్తితో ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని సిపిఐ పట్టణ కార్యదర్శి జే రమేష్ పిలుపునిచ్చారు. బొలెమోని నాగన్న భౌతిక కాయంపై సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, జిల్లా నేతలు కళావతమ్మ, పృథ్వి నాథం, చిన్న కురుమన్న, జయమ్మ, వంశీ, ఎర్రన్న తదితరులు ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. వనపర్తి లో పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడరన్నారు. అనంతరం పార్టీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గోపాలకృష్ణ ఎర్రకురుమన్న జ్యోతి, శిరీష, కొండన్న, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

