- డిమాండ్ చేసిన గురుకుల ఉపాధ్యాయ సంఘం..
- గురుకులాల నిర్వహణకు రూ.75 కోట్లను మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం..
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గురుకులాల్లోని ఉద్యోగులకు హెల్త్స్కీమ్ వర్తింపజేయాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ సంఘం ప్రకటనలో డిమాండ్ చేసింది. మాడల్, ఎయిడెడ్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు వర్తింపజేసే అంశంపై స్పష్టతనివ్వలేదని సంఘం చైర్మన్ రామలక్ష్మణ్, నాయకులు బాలస్వామి, రవి తెలిపారు. కాగా మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల నిర్వహణకు ప్రభుత్వం రూ.75 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి శ్రీధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -
