బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President) కేటీఆర్ని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి (Bobba Navatha Reddy) మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బేషరతుగా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి అంగీకారం తెలిపారు. నవంబర్ 2 ఆదివారం ఉదయం 11 గంటలకు భారీ సంఖ్యలో అనుచరులతో వచ్చి చేరనున్నారు. పార్టీని బలోపేతం చేయటమే తన ముఖ్య లక్ష్యమని తెలిపారు. శేరిలింగంపల్లి(Serilingampally)లో చెల్లాచెదురై ఇతర పార్టీల్లో చేరిన ఉద్యమకారులందరూ సొంత గూటికి చేరాలని విజ్ఞప్తి (Request) చేశారు. బీఆర్ఎస్ని బలోపేతం చేసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీ జెండా (Party Flag) ఎగరేద్దామని పిలుపునిచ్చారు.
KTR | కేటీఆర్ని కలిసిన మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి
RELATED ARTICLES
- Advertisment -
