వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం (compensation) చెల్లించాలని కోరుట్ల శాసన సభ్యుడు (Korutla Mla) కల్వకుంట్ల సంజయ్ (Kalvakuntla Sanjay) ప్రభుత్వాన్ని కోరారు. సన్న వడ్లకు రూ.30 వేలు, దొడ్డు వడ్లకు రూ.20 వేలు ఇవ్వాలని అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో (Cyclone Affected Areas) ఆయన గురువారం పర్యటించారు. దెబ్బతిన్న పంటలను (Damaged Crops) పరిశీలించారు. వరి, మొక్కజొన్న, కూరగాయల (Vegetables) పంటలు నీట మునిగాయి. వాటిని కూడా చూసి అన్నదాతలకు ధైర్యం చెప్పారు. మొక్కజొన్నల కొనుగోలులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటూ ఉండటం వల్ల కర్షకులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
- Advertisement -
