మహబూబ్ నగర్: స్థానిక సంస్థల ఎన్నికలలో ఎటువంటి పొరపాట్లకు తావు ఉండకూడదని అధికారులను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. మంగళవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల ప్రొసీడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో అధికారుల పాత్ర కీలకమని నొక్కి చెప్పారు.