గద్వాల పట్టణ(Gadwal Town) కేంద్రంలో జరిగిన శ్రీకృష్ణ కాలచక్ర మహాయాగం(Lord Krishna Kalachakra Mahayagama)లో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ(DK Aruna) పాల్గొన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన శ్రీదేవి(Sridevi), భూదేవి(Bhudevi) సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి (Wedding Festival of Lord Venkateswara) హాజరయ్యారు. గద్వాల పట్టణంలో ఇలాంటి ఆధ్యాత్మిక వేడుక(Spiritual Celebration) జరపడం, అందులో తాను పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. భగవంతుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
- Advertisement -
