సీఎంకు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
జగిత్యాల జిల్లా (Jagtial District) మల్యాల మండలం కొండగట్టు(Kondagattu)లో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో (Fire Accident) నష్టపోయిన బాధితులను (Victims) ఆదుకోవాలని చొప్పదండి ఎమ్యెల్యే మేడిపల్లి సత్యం (Medipalli Sathyam) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన.. మంత్రి అడ్లూరి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ప్రమాద వివరాలు సీఎంకి తెలిపారు. కొండగట్టులో ప్రమాదం 26 ప్లాస్టిక్ బొమ్మల దుకాణాలు దగ్ధం కాగా వ్యాపారులకు లక్షల రూపాయల నష్టం సంభవించింది.
- Advertisement -
