Tuesday, May 5, 2026
HomeతెలంగాణInvestigation | బీ.ఆర్.ఎస్. దిమ్మదిరిగే షాక్..

Investigation | బీ.ఆర్.ఎస్. దిమ్మదిరిగే షాక్..

  • ఆ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పొందాలపై సీబీఐ దర్యాప్తు..
  • కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్..

తెలంగాణ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో గట్టి షాక్ తగిలింది. ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ), విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక తీర్మానం చేశారు.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని విచారణ కమిషన్ ఈ అంశంపై సమర్పించిన 114 పేజీల నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి (4×270 మెగావాట్లు), యాదాద్రి (5×800 మెగావాట్లు) థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో అవినీతి, ప్రజాధనం దుర్వినియోగం జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికపై అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయసలహా తీసుకున్న తర్వాతే కేబినెట్ ఈ నిర్ణయానికి వచ్చింది.

- Advertisement -

ఈ ఒప్పందాలలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ మధ్య అంతర్రాష్ట్ర అంశాలతో పాటు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రమేయం కూడా ఉన్నందున, సీబీఐ విచారణే సరైనదని కేబినెట్ అభిప్రాయపడింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల తర్వాత రేవంత్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరిన రెండో ప్రధాన అంశం ఇదే కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కేసును త్వరగా సీబీఐకి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News