Friday, September 12, 2025
ePaper
spot_img
Homeరాజకీయంబనకచర్లపై బీఆర్ఎస్ అనవసర ఆరోపణలు: టీపీసీసీ చీఫ్

బనకచర్లపై బీఆర్ఎస్ అనవసర ఆరోపణలు: టీపీసీసీ చీఫ్

బనకచర్లపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అనవసరమైన ఆరోపణలు చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల విషయంలో రాజీపడేది లేదని తేల్చిచెప్పారు. కృష్ణా, గోదావరి నీళ్లపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి లేదని అన్నారు. కేసీఆర్ ఏపీ వెళ్లి చేపల పులుసు తిని తెలంగాణ వాటాను తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. గతాన్ని మరిచి వాళ్లు ఇప్పుడు గోదావరి, కృష్ణా జలాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News