ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ పట్టణం(Asifabad Town)లోని ఎంఐఎం పార్టీ ముఖ్య నేతలు(MIM Party Leasers) బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లో చేరారు. ఈ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Lakshmi) నివాసం(mla house in asifabad town)లో జరిగింది. వారికి శాసన సభ్యురాలు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ విధానాలు, ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమాలు, పార్టీ కార్యకర్తలపై చూపే అభిమానం, ఆప్యాయత చూసి ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎంఐఎం పార్టీ సీనియర్ నాయకులు.. మహ్మద్ సల్మాన్ ఖాన్, మహ్మద్ ఆఫ్జల్, షేక్ నసిర్. సింగిల్ విండో మాజీ చైర్మన్ అలీ బిన్ అహ్మద్, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్, నిస్సార్, ఎత శ్యామ్, ch.రవి, బలరాం నాయక్, జావేద్, అహ్మద్, అమర్ తదితరులు పాల్గొన్నారు.
