సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ (AP Cabinet) సచివాలయం(Secretariat)లో భేటీ అయింది. మూడున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మంత్రులు అనిత(Anitha), నారా లోకేష్(Nara Lokesh), అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, నారాయణ, సవిత, రామానాయుడు, కందుల దుర్గేశ్, పార్థసారథి, ఫరూక్, సత్యకుమార్, జనార్ధన్ రెడ్డి, రవీంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 70 అంశాలపై చర్చించారు. అమరావతి(Amaravathi)లో క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు, పలు సంస్థలకు భూముల కేటాయింపు, రాయితీలు, రెవెన్యూ శాఖలో ఖాళీల భర్తీ వంటి నిర్ణయాలు తీసుకున్నారు. తుఫాన్ (Cyclone) సమయంలో మంత్రులు కష్టపడి పనిచేశారని సీఎం చంద్రబాబు మెచ్చుకున్నారు.
AP Cabinet | ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
