- బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈనెల 23న ఛలో రాజ్ భవన్
- వేలాదిమందితో యువతతో రాజ్ భవన్ ముట్టడిస్తాం
బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ మరియు AIOBCSA నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుపడుతున్న కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర గవర్నర్ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 23 న ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీ విద్యార్థులు అధికసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, AIOBCSA OU ఇంచార్జ్ గణేష్ గౌడ్ ,AIOBCSA తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ శివ యాదవ్ , లక్ష్మణ్, ప్రశాంత్, చిందంమధు, శివ యాదవ్, అశ్వన్, సూర్య పిలుపునిచ్చారు.
- Advertisement -
