- పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు..
మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు.. ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తోంది.. కాగా మోహన్ నాయక్ ఇంటితో పాటు 11 ప్రాంతాల్లోని అతని బంధువుల నివాసాల్లో ఉదయం నుండి తనిఖీలు కొనసాగుతున్నాయి.. ఇప్పటికే అక్రమ సంపాదనకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.. ఆదాయానికి మించిన ఆస్తులు కనుగొన్నారు.. లెక్క పత్రం లేని నగలు కొన్ని డాక్యుమెంట్స్ లభించినట్లు తెలుస్తోంది.. ఇంకా సోదాలు కొనసాగితుతున్నాయి.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..


- Advertisement -
